మాదిగ ఐక్య వేదిక అధ్వర్యంలో నిర్వహించిన మాదిగ అమరవీరుల సంస్మరణ ర్యాలీ హైదరాబాద్ లో జరిగింది. ఈ కార్య క్రమంలో మాజీ మంత్రి జహీరాబాద్ కాంగ్రెస్ పార్టీ ఇన్ ఛార్జ్ డాక్టర్ ఏ చంద్రశేఖర్ పాల్గొని అమరవీరులకు నివాళులర్పించారు. మాదిగ అమరవీరుల కుటుంబాల ఆశయాలను అమలు పరిచే విధంగా రాష్ట్ర ప్రభుత్వం మాదిగలకు రిజర్వేషన్ కల్పించడానికి మాదిగ అమరవీరుల త్యాగలేనని, ఈ విజయం మాదిగ అమరవీరులదేనని వారన్నారు.