తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీజీఎస్ఆర్టీసీ) మేనేజింగ్ డైరెక్టర్ వీసీ సజ్జనార్ సంచలన ప్రకటన చేశారు. ప్రయాణీకులకు శుభ వార్త చెప్పారు. బస్సుల్లో ఇక నుంచి చిల్లర సమస్యకు స్వస్తి పలకాలని నిర్ణయం తీసుకున్నామన్నారు. సిటీ బస్సుల్లో క్యూ ఆర్ కోడ్ తో స్కానింగ్ సదుపాయం తీసుకు వచ్చామన్నారు. యూపీఐ పేమెంట్ ద్వారా టికెట్ తీసుకునే అవకాశం కల్పిస్తున్నామన్నారు. ఆటోమేటిక్ ఫేర్ కలెక్షన్ సిస్టమ్ ద్వారా ఆర్టీసీ ఆన్లైన్ టికెటింగ్ కు శ్రీకారం చుట్టామన్నారు.