ఆదర్శమైన జీవనానికి ప్రేరణ: సీఐ
NEWS Mar 01,2025 03:26 pm
మెట్ పల్లి: శనివారం సాయంత్రం నెలవంక కనిపించడంతో రంజాన్ మాసం ప్రారంభమైంది. ఈ సందర్భంగా మెట్ పల్లి సీఐ నిరంజన్ రెడ్డి ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలిపారు. రంజాన్ మాసంలో ముస్లింలు ఉపవాస దీక్షలు, ప్రార్థనలు చేస్తారని, ఇది ఆదర్శవంతమైన జీవనానికి ప్రేరణ ఇస్తుందని సీఐ పేర్కొన్నారు. ఈ వేడుకలను సుఖ సంతోషాలతో జరుపుకోవాలన్నారు.