ముస్లింల అత్యంత ముఖ్యమైన పండుగ రంజాన్ మాసం రేపటినుంచి ప్రారంభం కానుంది. శనివారం నెలవంక దర్శనం ఇవ్వడంతో రేపటి(ఆదివారం) నుంచి దేశ వ్యాప్తంగా రంజాన్ ఉపవాస దీక్షలు ప్రారంభం కానున్నాయి. ఉపవాస దీక్షల నేపథ్యంలో రేపట్నుంచి ఏప్రిల్ 1వ తేదీ వరకు ఉర్దూ మీడియం విద్యార్థులకు ఒంటిపూట బడులు నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.