ఎన్నికలలో ఇచ్చిన హామీలు నెరవేర్చాలి
NEWS Mar 01,2025 08:24 pm
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరకాలం గడిచిపోయిన ఎన్నికల ముందు వ్యవసాయ కార్మికులకు సంవత్సరానికి 12,000 ఇస్తానన్న హామీ ఇంకెప్పుడు అమలు చేస్తారని వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు బుర్రి ప్రసాద్ కరీంనగర్ లో శనివారం మీడియా సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. కౌలు రైతులకు 15వేల రూపాయలు ఇస్తానని అదేవిధంగా ఇల్లు లేని వారికి ఇందిరమ్మల నిర్మాణం కోసం 5 లక్షల రూపాయలు ఇస్తామని, పెన్షన్ 4000 రూపాయలు పెంచి ఇస్తామని ప్రజలను మోసం చేసిందని అన్నారు.