క్యాంప్ గడి విద్యార్థుల విజ్ఞానయాత్ర
NEWS Mar 01,2025 12:31 pm
కోరుట్ల SRSP క్యాంప్ గడి ప్రాథమిక పాఠశాల విద్యార్థిని, విద్యార్థులు, ఉపాధ్యాయులు విహార విజ్ఞాన యాత్ర చేస్తున్నారు. పోచంపాడు ప్రాజెక్టు, జల విద్యుత్ కేంద్రం, ఆర్మూర్ సిద్ధులగుట్ట క్షేత్రం, పాల్గుట్ట రాములు మహారాజ్ క్షేత్రాన్ని, బాసర క్షేత్రాన్ని దర్శించుకున్నారు. అలిసాగర్, జనకంపేట, సారంగాపూర్ టెంపుల్, నిజామాబాద్ ఖిల్లా తదితర క్షేత్రాలను సందర్శించారు. ప్రధానోపా ధ్యాయులు నూనావత్ రాజు, ఉపాధ్యాయులు పూర్ణ చందర్, సురేందర్, ధనలక్ష్మి, సుమలత పాల్గొన్నారు.