ఈషా ఫౌండేషన్ కు సుప్రీంకోర్టు ఊరట
NEWS Mar 01,2025 09:04 am
అక్రమ నిర్మాణాలు చేపట్టారని ఆరోపణలు ఎదుర్కొంటున్న జగ్గీ వాసుదేవన్ నిర్వహిస్తున్న ఈషా ఫౌండేషన్ కు భారీ ఊరట లభించింది. విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు ఎలాంటి ముందస్తు చర్యలు తీసుకోవద్దంటూ స్పష్టం చేసింది. ఇదిలా ఉండగా జగ్గీ వాసుదేవన్ పై పెద్ద ఎత్తున విమర్శలు ఉన్నాయి. ఆధ్యాత్మిక వేత్తగా, పర్యావరణ పరిరక్షకుడిగా తనను తాను ప్రచారం చేసుకుంటూ మోడీ, సీఎంలతో అంటకాగుతూ అక్రమాలకు పాల్పడుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి.