పార్టీ కోసం పని చేసిన వారికి తప్పకుండా ప్రయారిటీ ఉంటుందని స్పష్టం చేశారు తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ మీనాక్షి నటరాజన్. పార్టీ కార్యకర్తల ముఖ్య సమావేశంలో ప్రసంగించారు. వందేళ్లకు పైగా చరిత్ర కలిగిన పార్టీ మనదని, ఆ విషయం ఎవరూ మరిచి పోవద్దని అన్నారు. బ్రిటీష్ వారితో పోరాడిన పార్టీ మనదన్నారు. పార్టీ బలోపేతం కోసం కృషి చేసిన వారి గురించి తనకు తెలుసన్నారు. తన వద్ద పూర్తి వివరాలు ఉన్నాయని ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు.