యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మి నరసింహ స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభం అయ్యాయి. ఈనెల 11వ తేదీ వరకు ఉత్సవాలు కొనసాగనున్నాయి. ఈ సందర్బంగా ఆలయ కమిటీ ఆధ్వర్యంలో భారీ ఎత్తున ఏర్పాట్లు చేశారు. ఉత్సవాలకు రాష్ట్ర గవర్నర్ తో పాటు సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు హాజరవుతారని ఈవో భాస్కర్ రావు వెల్లడించారు. సుదూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేశామన్నారు.