NRPT: నారాయణపేట, కోస్గి పట్టణాలలోని కోర్టులలో మార్చి 8న నిర్వహించే జాతీయ లోక్ అదాలత్ ను కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని నారాయణపేట జిల్లా ఎస్పీ యోగేష్ గౌతమ్ అన్నారు. లోక్ అదాలత్లో పరిష్కారం అయ్యే కేసులను రాజీ మార్గం ద్వారా పరిష్కరించుకోవాలని సూచించారు. కేసులను పరిష్కరించు కోవాలని అనుకున్న వారు స్థానిక పోలీసులను సంప్రదించాలని చెప్పారు.