కొమురవెల్లిలో అత్యంత పవిత్రమైన మల్లన్న పట్నం నిర్వహించే సమయంలో కొమురవెల్లి ఆలయ ధర్మకర్త జయప్రకాష్ రెడ్డి కాళ్లకు చెప్పులతో ప్రవర్తించిన తీరుపై వరంగల్ జిల్లా కురుమ సంఘం అధ్యక్షులు దయ్యాల శ్రీనివాస్ కురుమ మండిపడ్డారు. జయప్రకాష్ రెడ్డిని ఆలయ ధర్మకర్త పదవి నుంచి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. ఆలయ ధర్మకర్త పదవిలో ఇకనైనా తమ కురుమ సామాజిక వర్గానికి చెందిన వారికి అవకాశం ఇవ్వాలని కోరారు.