బస్సు ప్రమాద బాధితులను పరామర్శించిన ప్రసన్న హరికృష్ణ
NEWS Feb 28,2025 11:54 pm
కరీంనగర్ మెదక్ ఆదిలాబాద్ నిజామాబాద్ పట్టభద్రుల ఉపాధ్యాయ MLC ఎన్నికలు ముగిసిన తరువాత బైంసా నుంచి బ్యాలెట్ బాక్స్లు సిబ్బందితో కరీంనగర్ వచ్చి వెళ్తున్న సమయంలో ఆర్టీసీ బస్సు ప్రమాదంలో గాయపడి కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారిని పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్ధి ప్రసన్న హరికృష్ణ పరామర్శించారు. ప్రమాదానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. గాయపడ్డ వారికి మెరుగైన చికిత్సను అందించాలని ఆసుపత్రి వైద్యులను కోరారు.