MBNR: విద్యార్థుల్లో శాస్త్రీయ దృక్పథం పెంపొందిస్తూ సైన్స్ పై అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్ విజయేంద్ర బోయి అన్నారు. శుక్రవారం గాజులపేట జడ్పీ పాఠశాలలో జాతీయ సైన్స్ దినోత్సవ సందర్భంగా విద్యార్థులు ఏర్పాటు చేసిన సైన్స్ ఎగ్జిబిషన్ని కలెక్టర్ సందర్శించారు. నిత్య జీవితంలో విద్యార్థులు సైన్స్ ప్రాధాన్యత పెంచుకొని మూఢనమ్మకాలను పారద్రోలాలని సూచించారు.