మల్లాపూర్ గ్రామ శివారులో చెట్టుకు ఉరివేసుకొని ముచ్చుకుర్తి రాజుకుమార్ (32) ఆత్మహత్య చేసుకున్నాడు. రాజుకుమార్ భార్యతో విడాకులు తీసుకున్నాడు. తాగుడుకు బానిసయ్యాడు. దీంతో జీవితంపై విరక్తి చెంది ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
మృతుడి తండ్రి జనార్దన్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.