సిరిసిల్ల: జాతీయ సైన్స్ దినోత్సవ సందర్భంగా సిరిసిల్లలోని రాజీవ్ నగర్ లో ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన సైన్స్ మేళా పిల్లల ప్రతిభ పాటలకు అద్దం పట్టింది. పిల్లల తయారుచేసిన సైన్స్ పరికరాలు ఇన్నోవేషన్స్ ప్రదర్శనకు పెట్టారు. పిల్లల్లో ఉన్న సృజనాత్మకతను పెంపొందించడానికి ఎలాంటి సైన్స్ మేళాలు ఎన్నో నిర్వహించాలని ప్రధానోపాధ్యాయులు వెంకటేశ్వర్లు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, గ్రామస్తులు పాల్గొన్నారు.