ములుగు జిల్లా కేంద్రంలో శ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్ 286వ జయంతి వేడుకలకు మంత్రి సీతక్క హాజరయ్యారు. సేవాలాల్ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. బంజారా జాతిని ఒక ధాటిపైకి తెచ్చిన ఘనత సంత్ సేవాలాల్ మహారాజ్ గారిదని అన్నారు. సేవాలాల్ మహారాజ్ గుడి, కమ్యూనిటీ భావన నిర్మాణ పనులను త్వరలో చేపడుతామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ బాణోత్ రవి చందర్ తదితరులు పాల్గొన్నారు.