ఏపీ బడ్జెట్ 2025-26 సంవత్సరానికి సంబంధించి నూతన బడ్జెట్ ను శాసన సభలో ప్రవేశ పెట్టారు. సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన మంత్రివర్గం ఆమోదం తెలిపింది. అంతకు ముందు ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ బడ్జెట్ ప్రతిని స్పీకర్ అయ్యన్నపాత్రుడుకు అందజేశారు. ఈ కీలక సమావేశంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. కీలక సూచనలు చేశారు. గత ప్రభుత్వం ఆర్థిక విధ్వంసానికి పాల్పడిందని ఆరోపించారు ఈ సందర్బంగా సీఎం చంద్రబాబు.