రమణీయం శ్రీశైల మల్లన్న రథోత్సవం
NEWS Feb 28,2025 10:50 am
మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి వారి రథోత్సవము రమణీయంగా సాగింది. ఈ కార్యక్రమానికి ముందుగా రథాంగా పూజ రథాంగ హోమం రథాంగ బలి నిర్వహించారు . అనంతరం స్వామి అమ్మ వార్ల ఉత్సవ మూర్తులను రథం పైన అధిరోహింప చేసి అంగరంగ వైభవంగా ఊరేగించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ రాజకుమారి గణీయ, జాయింట్ కలెక్టర్ విష్ణు చరణ్ , దేవస్థానం ఈవో శ్రీనివాస రావు దంపతులు పాల్గొన్నారు. రాత్రి 8 గంటలకు ఆలయ పుష్కరిణి వద్ద తెప్పోత్సవం కన్నుల పండువగా సాగింది.