కుంభ మేళా పోలీసులకు నజరానా
NEWS Feb 28,2025 10:41 am
ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్ సంచలన ప్రకటన చేశారు. గత జనవరి 13 నుంచి ఫిబ్రవరి 26వ తేదీ వరకు నిర్వహించిన మహా కుంభ మేళాలో శాంతి భద్రతలను పర్యవేక్షించిన పోలీసులకు భారీ నజరానా ప్రకటించారు. ఈ మేరకు ఒక్కో పోలీస్ కు రూ. 10,000 చొప్పున ప్రత్యేకంగా బోనస్ ఇస్తున్నట్లు తెలిపారు. మొత్తం 75,000 మంది పోలీసులు విధులు నిర్వహించారు.