ప్రభుత్వం సంచలన ప్రకటన చేసింది. తెలంగాణలో ఇంజనీరింగ్ సీట్లు ఇక నుంచి స్థానికులకే కేటాయిస్తున్నట్లు వెల్లడించింది. ఇక నుంచి 100 శాతం ఇంజనీరింగ్ సీట్లు రాష్ట్రానికి చెందిన వారికే ఇవ్వనున్నట్లు తెలిపింది. ఈ మేరకు సీఎస్ శాంతి కుమారి ఉత్తర్వులు జారీ చేశారు. ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం ముగియడంతో తాజాగా జీ ఓ విడుదల చేసింది. వరుసగా 9 తరగతి 10, ఇంటర్ వరకు లేదా 6 నుంచి ఇంటర్ వరకు ఎక్కువ ఎక్కడ చదివిన దాని బట్టి స్థానికతగా పరిగణనలోకి తీసుకుంటారు.