మల్లాపూర్: ప్రసిద్ధ శ్రీ కనక సోమేశ్వర ఆలయం వద్ద మహాశివరాత్రి ఉత్సవాల్లో భాగంగా గురువారం రాత్రి రథోత్సవం ఘనంగా జరిగింది. మల్లాపూర్ పరిసర ప్రాంతాల నుంచి వచ్చిన వేలాది మంది భక్తులు సోమేన్నను దర్శించుకుని రథోత్సవం కార్యక్రమంలో పాల్గొన్నారు. మెట్ పల్లి CI నిరంజన్ రెడ్డి, SI కిరణ్ కుమార్, SI రాజు ఆధ్వర్యంలో భద్రత ఏర్పాట్లు పర్యవేక్షించారు.