ఓటు వేసిన కలెక్టర్ దంపతులు
NEWS Feb 27,2025 08:38 pm
జగిత్యాల లో ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ లో కలెక్టర్ దంపతులు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఈ విషయాన్ని ఎన్నికల సంఘం ప్రత్యేకంగా ప్రస్తావించింది. ఓటు అత్యంత విలువైనదని, దానిని ప్రతి ఒక్కరు ఉపయోగించు కోవాలని తాము ఓటు వేశామన్నారు కలెక్టర్ దంపతులు. మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్ ఉపాధ్యాయ, పట్టభద్రుల నియోజకవర్గాలకు జరిగిన ద్వైవార్షిక ఎన్నికలలో జగిత్యాలలో వీరు ఓటు వేయడం విశేషం.