వైసీపీ మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ కు బిగ్ షాక్ తగిలింది. ఆయన ఇంటికి విజయవాడ సైబర్ క్రైమ్ పోలీసులు వెళ్లారు. బీఎన్ఎస్ సెక్షన్ 35/3 కింద గోరంట్లకు నోటీసులు ఇచ్చారు. మార్చి 5న సీసీ పీఎస్ కు హాజరు కావాలని నోటీసులలో పేర్కొన్నారు. గత ఏడాది నవంబర్ 2న సైబర్ క్రైమ్ పీఎస్ లలో ఎంపీపై ఫిర్యాదు చేశారు మాజీ మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ. పోక్సో కేసులో బాధితురాలి పేరు చెప్పారని ఆరోపించారు.