కాళేశ్వరం కమిషన్ విచారణలో మాజీ ఈఎన్సీ మురళీధర్ రావు వింత సమాధానాలు ఇచ్చారు. తీవ్ర అసహనం వ్యక్తం చేశారు కాళేశ్వరం కమిషన్ చీఫ్. కమిషన్ అడిగిన ప్రశ్నలకు మౌనంగా ఉన్నారు...గుర్తు లేదు, జ్ఞాపకశక్తి మందగించిందంటూ చెప్పడంపై మండిపడ్డారు.. జ్ఞాపకశక్తి తిరిగి రావాలంటే పుస్తకాలు ఎక్కువగా చదవాలని సూచించింది కమిషన్.