ఎన్టీఆర్ కు భారతరత్న పక్కా
NEWS Feb 27,2025 04:29 pm
దివంగత సీఎం ఎన్టీఆర్ కు భారత రత్న తప్పకుండా వస్తుందని ధీమా వ్యక్తం చేశారు తనయుడు, నటుడు బాలకృష్ణ. తన స్వంత ఊరు నిమ్మకూరును సందర్శించారు. ఈ సందర్బంగా తన పేరెంట్స్ ఎన్టీఆర్, బసవతారకం విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. కేంద్రం ఇచ్చే అత్యున్నత పురస్కారానికి తన తండ్రి అన్ని విధాలుగా అర్హుడని అన్నారు. దేశంలో ఏ నాయకుడు చేయని విధంగా సంక్షేమ పథకాలు అమలు చేసిన ఘనత తన తండ్రికే దక్కుతుందన్నారు. భారత రత్న పక్కా అని పేర్కొన్నారు.