దమ్ముంటే విచారణ చేసుకోవచ్చు
NEWS Feb 27,2025 01:42 pm
సీఎం రేవంత్ రెడ్డిపై నిప్పులు చెరిగారు మాజీ మంత్రి కేటీఆర్. నిరాధారమైన ఆరోపణలు చేయడం పనిగా పెట్టుకున్నాడని, దమ్ముంటే ఎలాంటి విచారణైనా చేసుకోవచ్చని సవాల్ విసిరారు. పరిపాలన చేతకాక మిస్టరీ మరణాలకు సంబంధించి తన పేరును ప్రస్తావించడం దారుణమన్నారు. నిరభ్యంతరంగా ఎవరితోనైనా , ఏ సంస్థతోనైనా ఎంక్వయిరీ చేసుకోవచ్చని స్పష్టం చేశారు కేటీఆర్. గత 15 నెలలుగా అటెన్షన్, డైవర్షన్ రాజకీయాలు చేయడం తప్పితే చేసింది ఏమీ లేదన్నారు.