నోటి దూలకు తగిన శాస్తి తప్పదు
NEWS Feb 27,2025 10:14 am
కమెడియన్ పృథ్వీ రాజ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. నటుడు పోసాని కృష్ణ మురళి అరెస్ట్ పై స్పందించాడు. ఎక్స్ వేదికగా నిప్పులు చెరిగారు. నోటి దూలకు తగిన శాస్తి తప్పదన్నాడు. నిజం ఎప్పుడూ న్యాయానికి తోడుగా నిలుస్తుందన్నారు. మాట విలువైనదని, వాటిని చాలా పొదుపుగా సందర్భానికి తగినట్లుగా వాడాలని సూచించాడు. నిజం తెలుసుకుని ఎప్పుడు , ఎక్కడ ఆగి పోవాలో తెలిసిన వాడు మహా పురుషుడంటూ పేర్కొన్నాడు పృథ్వీ రాజ్. తాజాగా ఆయన చేసిన కామెంట్స్ కలకలం రేపుతున్నాయి.