ఎస్ఎల్బీసీ ఘటనపై ఎమ్మెల్యే ఆరా
NEWS Feb 27,2025 08:33 am
నాగర్ కర్నూల్ జిల్లా దోమలపెంట వద్ద చోటు చేసుకున్న ఎస్ఎల్బీసీ ఘటనకు సంబంధించి ఆరా తీశారు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. ఇప్పటికే మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డితో పాటు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ఘటనా స్థలం వద్దే ఉన్నారు. దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. ఎస్ఎల్బీసీలో పనులు జరుగుతుండగా ఎనిమిది మంది కార్మికులు కనిపించకుండా పోయారు. వారి ఆచూకి కోసం ప్రయత్నాలు కొనసాగుతున్నాయి.