మహాశివరాత్రిని పురస్కరించుకొని కరీంనగర్ లోని పాత బజార్ శివాలయాన్ని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆలయంలో బండి సంజయ్ కుమార్ ప్రత్యేక పూజలు చేశారు. దేశంలోని ప్రజలు సుఖశాంతులతో ఉండాలని, పాడిపంటలు సమృద్ధిగా పండాలని ఆకాంక్షించినట్లు ఆయన తెలిపారు.