ఎస్ఎల్బీసీ వద్ద సహాయక చర్యలు
NEWS Feb 26,2025 11:10 am
జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి నాగర్ కర్నూల్ జిల్లా దోమలపెంట వద్ద ఎస్ఎల్బీసీని సందర్శించారు. ఈ సందర్బంగా మంత్రులు నిద్ర హారాలు మాని ఇక్కడే పర్యవేక్షిస్తున్నారని చెప్పారు. టన్నెల్ లోకి పోవాలంటేనే భయం పుడుతుందన్నారు. లోపల చిక్కుకున్న ఎనిమిది మంది కోసం రెస్క్యూ టీం 13 కిలోమీటర్ల లోపలికి వెళ్లారని చెప్పారు. సీఎం ఆదేశాల మేరకు మంత్రులు జూపల్లి, ఉత్తమ్ ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారని తెలిపారు. లోపల మట్టి, బురద ఉండడం వల్ల ఇబ్బంది ఏర్పడిందన్నారు.