మెట్పల్లి ప్రభుత్వ జూనియర్ కళాశాల వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి.ఈ సందర్భంగా ప్రిన్సిపల్ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. ధనంతో ఎవరినైనా కొనవచ్చని, కాని సరస్వతీ దేవిని కొనలేరన్నారు. విద్యార్థులంతా రానున్న పరీక్షల్లో అత్యధిక మార్కులు సాధించి కళాశాలకు మంచి పేరు తీసుకురావాలన్నారు. విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనలు చూపరులను ఆకట్టుకున్నాయి. ఉపాధ్యాయులు పాల్గొన్నారు.