మెదక్ పట్టణానికి చెందిన హర్కర్ మహిపాల్ పాడిన ఏడుపాయల దుర్గా భవానీ జాతరకు సంబంధించిన పాటల సీడీని కలెక్టరేట్ లో జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ ఆవిష్కరించారు. ఈ సందర్బంగా మహిపాల్ ను అభినందించారు. రాబోయే రోజుల్లో మరిన్ని పాటలు రాసి పాడాలని ఆకాంక్షించారు. హర్కార్ మైపాల్ మాట్లాడుతూ అమ్మ వారిపై పాట రాయడం ఆనందంగా ఉందన్నారు. అలాగే మెదక్ అభివృద్ధి పోరాట సమితిపై కూడా పాటలు రాస్తానని చెప్పారు.