మహా శివరాత్రి సందర్భంగా వెంకటాపూర్ మండలం పాలంపేట గ్రామంలో ప్రసిద్ధి చెందిన రామప్పకు ఈ నెల 26 నుంచి హనుమకొండ నుంచి ఆర్టీసీ బస్సులు నడపనున్నట్టు డిపో మేనేజర్ జోష్ణ తెలిపారు. ఉదయం 6:30 గంటల నుంచి ప్రతి గంటకు ఒక బస్సును, అదే విధంగా ములుగు నుంచి రామప్పకు మధ్యాహ్నం 2:30 నుంచి 15 నిమిషాలకు ఒక బస్సును నడపనున్నట్లు తెలిపారు. భక్తుల రద్దీని బట్టి బస్సుల సంఖ్యను పెంచనున్నట్లు తెలిపారు.