టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికలకు గట్టి బందోబస్తు
NEWS Feb 25,2025 05:52 pm
ఈ నెల 27 వ తేదీన జరుగనున్న నల్గొండ- ఖమ్మం - వరంగల్ ఉమ్మడి జిల్లా ఉపాధ్యాయ MLC ఎన్నికలకు సంభందించి జిల్లాలో అన్ని మండల కేంద్రాల్లో మొత్తం 09 పోలింగ్ కేంద్రాల్లో పోలింగ్ జరుగుతుంది. దీనికి సంభందించి 200 మంది పోలీసు సిబ్బంది విధులు నిర్వర్తిస్తున్నారని జిల్లా ఎస్పి డా.శబరీష్. తెలిపారు. పోలింగ్ బూత్ వద్ద 100 మీటర్ల, 200 మీటర్ల పరిధిలో ఎన్నికల నియమావళి ప్రకారం ఆంక్షలు ఉంటాయని,163 BNSS ఆక్ట్ (144 సెక్షన్) అమలులో ఉంటుందని అన్నారు.