ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు మంత్రి నారా లోకేష్. ఆధారాలు లేకుండా ఆరోపణలు చేయడం మానుకోవాలన్నారు. వీసీలకు తాము బెదిరించినట్లు నిరూపించాలని సవాల్ విసిరారు. భయ పెట్టడం, బెదిరించడం తమకు రాదన్నారు. వీసీలను బలవంతంగా రాజీనామాలు చేయించారని ఎమ్మెల్సీ చేసిన కామెంట్స్ పై భగ్గుమన్నారు. ఇంతకు మించి ఇంకేం అనగలరని అన్నారు. ఆరోపణలు సరికాదని వీలైతే ఆధారాలతో రావాలన్నారు నారా లోకేష్.