శివరాత్రి పండుగను పురస్కరించుకొని మెట్ పల్లి ఆర్టీసీ డిపో నుంచి ప్రత్యేకంగా 30 బస్సులను నడుపుతున్నట్లు డిపో మేనేజర్ దేవరాజు తెలిపారు. ఈ సందర్భంగా బస్సులకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆర్టీసీ అధికారులు మొదటి బస్సును ప్రారంభించారు. పెద్దలకు 150, పిల్లలకు 80 రూ. టికెట్ చార్జీలు ఉన్నట్లు మేనేజర్ పేర్కొన్నారు.