మల్లాపూర్ శ్రీ కనక సోమేశ్వర స్వామిని మంగళవారం మెట్ పల్లి డిఎస్పీ రాములు దర్శించుకున్నారు. శివరాత్రి మహోత్సవాన్ని పురస్కరించుకొని జరిగే జాతర ఉత్సవాలకు ఎలాంటి ఆటంకాలు జరగకుండా ప్రత్యేక సిబ్బందితో పర్యవేక్షిస్తున్నామని డిఎస్పీ తెలిపారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ ఛైర్మన్ సంఘ గంగరాజం ఆధ్వర్యంలో డిఎస్పీ రాములు, ఎస్సై రాజు లను శాలువాతో సన్మానించారు.