పాత విధానాలతోనే అభివృద్ధి చెందుతాం
NEWS Feb 25,2025 04:31 pm
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా రూపొందిస్తున్న ఇసుక విధానం ప్రస్తుత విధానానికి లోబడి ఉండాలని వెంకటాపురం, వాజేడు మండలాలకు చెందిన ఆదివాసీ ఇసుక పరస్పర సహకార సంఘాల సభ్యులు జిల్లా కలెక్టర్ కి వినతిపత్రం అందజేశారు. ఐదో షెడ్యూల్ ప్రాంతం లో పాత విధానాన్నే కొనసాగించాలని, ఆదివాసీ ఇసుక పరస్పర సహకార సంఘాలకు సంపూర్ణ అధికారాలు కలిగిన ప్రస్తుత విధానాన్నే కొనసాగించడం ద్వారా మేము ఆర్ధికంగా బలోపేతం అవుతాము అని సభ్యులు తెలిపారు.