స్పీకర్ అయ్యన్నపాత్రుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అసెంబ్లీలో చోటు చేసుకున్న ఘటన పట్ల ఆవేదన చెందారు. తాను ఇన్నేళ్లుగా ఇలాంటి సీన్ చూస్తానని అనుకోలేదన్నారు. ప్రజలు ఎన్నుకున్న ప్రజా ప్రతినిధులు ఇలాగేనా వ్యవహరించేది అంటూ వాపోయారు. జగన్ గతంలో సీఎంగా పని చేశారని, కానీ తన పార్టీకి చెందిన నేతలను కంట్రోల్ చేయడంలో విఫలమం కావడం బాధాకరమన్నారు. గవర్నర్ ప్రసంగిస్తున్న సమయంలో వినకుండా వెళ్లి పోవడం ఎంత వరకు సబబు అని ప్రశ్నించారు.