ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ లక్ష్యం
NEWS Feb 25,2025 12:16 pm
తెలంగాణ రాష్ట్రాన్ని ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఆవిష్కరణలు, పరిశోధన, తయారీ, నైపుణ్యాల కేంద్రంగా అభివృద్ధి చేయాలని ముందుకు సాగుతున్నామన్నారు. సులభమైన పారిశ్రామిక విధానం, మౌలిక సదుపాయాలు, ఆశించినంత మద్దతు అందించేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. పెట్టుబడులను ఆకర్షించడంలో దేశంలోనే తెలంగాణ నంబర్ వన్ స్థానంలో ఉందన్నారు.