బంగాళాఖాతంలో భారీ భూకంపం సంభవించింది. మంగళవారం ఉదయం 6.10 గంటలకు రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 5.1 తీవ్రతతో భూకంపం సంభవించినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ (ఎన్సీఎస్) తెలిపింది. భూకంపం తీవ్రత కారణంగా బంగాల్, ఒడిశాలోని పలు ప్రాంతాల్లో ప్రకంపనలు వచ్చినట్లు అధికారులు పేర్కొన్నారు. బంగాళాఖాతంలోని సముద్ర గర్భంలో 91 కి.మీ లోతున భూకంపం సంభవించినట్లు ఎక్స్ వేదికగా ఎన్సీఎస్ పోస్ట్ చేసింది. మరిన్నీ వివరాలు తెలియాల్సి ఉంది.