MBNR: ఎల్లారెడ్డిలో ఎన్నికల ప్రచారం ముగించుకుని వస్తున్న సమయంలో హైవే మీద మూసాయిపేట దగ్గర ముందు వెళ్తున్న కారు సడన్ గా కాన్వాయ్ లోకి వచ్చిన ట్రాక్టర్ ను ఢీకొట్టడంతో వెనుక ఉన్న కారు ముందు కారును ఢీకొట్టిందని ఎంపీ డీకే అరుణ తెలిపారు. ఈ ఘటనలో ముందున్న కారులోని వాళ్లకు గాని.. తమకు గాని ఎలాంటి ప్రమాదం జరగలేదు ఆమె పేర్కొన్నారు. కార్యకర్తలు, ఎవరు ఆందోళన పడొద్దు అని ఎంపీ ఒక ప్రకటనలో వివరించారు.