మంత్రి సవిత నిప్పులు చెరిగారు. జగన్ పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతిపక్ష హోదా ఎవరిస్తారో నీకు తెలీదా అని ప్రశ్నించారు. అధికారంలో 30 ఏళ్లు ఉంటున్నానంటూ ఇంకా ఎన్నాళ్లు భ్రమల్లోనే బతుకుతావ్ అంటూ మండిపడ్డారు. నిన్ను గెలిపించిన పులివెందుల కోసం ప్రజల కోసమైనా అసెంబ్లీకి రావాలని హితవు పలికారు. ఏ చర్చకైనా సిద్దమని ప్రకటించారు. ప్రజలను భ్రమలో పెట్టాలని జగన్ భావిస్తున్నారని, ఆయనను నమ్మే స్థితిలో ఎవరూ లేరని స్పష్టం చేశారు.