ఇబ్రాహీంపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలో మద్యం మత్తులో వాహనం నడిపిన ఇబ్రహీంపట్నంకు చెందిన ఓ వ్యక్తికి న్యాయస్థానం 4 రోజుల జైలు శిక్ష విధించినట్లు ఎస్సై అనిల్ తెలిపారు. తనిఖీలు నిర్వహిస్తున్న సమయంలో నిందితుడు మద్యం మత్తులో వాహనం నడుపుతున్నట్లు గుర్తించి కేసు నమోదు చేసి మెట్ పల్లి ప్రథమ శ్రేణి న్యాయస్థానం ముందు హాజరు పరచగా. 4 రోజుల రిమాండ్ విధించినట్లు పేర్కొన్నారు.