ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అక్రమాలపై సిట్ ఏర్పాటు చేసింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. వైసీపీ హయాంలో జగన్ ను , అధికారాన్ని అడ్డం పెట్టుకుని అక్రమ మైనింగ్ సహా భూ కబ్జాలకు పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ మొత్తం వ్యవహారంపై జీవీజీ అశోక్ కుమార్ నేతృత్వంలో సిట్ (స్పెషల్ ఇన్వెస్టిగేటివ్ టీం) ఏర్పాటు చేసింది.