కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించండి
NEWS Feb 24,2025 06:16 pm
పట్టభద్రుల ఎమ్మెల్సీగా కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని, మెట్ పల్లిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కొమిరెడ్డి కరంచంద్ ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన ఏడాదిన్నర కాలంలోనే వేల సంఖ్యలో ఉద్యోగాలను భర్తీ చేసిందని, ఈ ఎన్నికలో కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థిని గెలిపించాలని ఓటర్లను కోరారు.