మాజీ సీఎం జగన్ పై సిరియస్ కామెంట్స్ చేశారు మంత్రి అచ్చెన్నాయుడు. ఏం సాధించారని వైసీపీకి ప్రతిపక్ష హోదా వస్తుందని ప్రశ్నించారు. సోయి లేకుండా వైసీపీ నేతలు మాట్లాడుతున్నారంటూ ఆరోపించారు. ఏ పార్టీకైనా లేదా ఏ నాయకుడికైనా ప్రజలే స్వయంగా హొదా కల్పిస్తారని , అది తెలుసు కోలేక పోవడం విడ్డూరంగా ఉందన్నారు. ప్రతిపక్ష హోదా ఇవ్వక పోతే అసెంబ్లీకి రానని ప్రకటించడం దారుణమన్నారు. ఇందుకోసమేనా మిమ్మల్ని ఎన్నుకున్నదని అన్నారు.