కోయిల్ సాగర్ కు రూ.3.50 కోట్లు మంజూరు
NEWS Feb 24,2025 10:51 am
NRPT: కోయిల్ సాగర్ ప్రాజెక్టును పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం జీవో విడుదల చేసింది. ఈ మేరకు ఈనెల 18 న అభివృద్ధి పనుల కోసం రూ.3.50 కోట్లు మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నిధులతో ప్రాజెక్టు వద్ద హరిత హోటల్, కాటేజీల సౌకర్యం, బోటింగ్ కల్పించనున్నారు. ఈ పనులకు సంబంధించి త్వరలోనే టెండర్లు ఆహ్వానించినట్లు అధికారులు తెలిపారు.