నాగర్ కర్నూల్ జిల్లా దోమలపెంట లోని ఎస్ఎల్బీసీ టన్నెల్ లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. టన్నెల్ లో చిక్కుకున్న ఎనిమిది కార్మికులను కాపాడేందుకు ప్రయత్నం జరుగుతోంది. ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగాయి. ఢిల్లీ నుంచి హైదరాబాద్ కు చేరుకున్నారు ఆరుగురు ర్యాట్ హోల్ మైనర్స్. ఇంకో వైపు విశాఖ నుంచి నేవీ బృందం కూడా భాగం పంచుకుంటోంది. షిఫ్ట్ ల వారీగా సహాయక చర్యలు చేపట్టాయి రెస్క్యూ టీమ్స్. ఇంకో వైపు కార్మికులు బతికే ఛాన్స్ లేదంటున్నారు మంత్రి జూపల్లి కృష్ణారావు.