తిరుమల భక్తులతో కిటకిట
NEWS Feb 24,2025 09:24 am
తిరుమల పుణ్య క్షేత్రం భక్త బాంధవులతో కిటకిట లాడుతోంది. శ్రీ వేంకటేశ్వర స్వామి, శ్రీ అలివేలు మంగమ్మలను 78 వేల 892 మంది భక్తులు దర్శించుకున్నారు. 25 వేల 930 మంది తల నీలాలు సమర్పించారు. కానుకలు, విరాళాల రూపేణా శ్రీవారి హుండీ ఆదాయం రూ. 3.55 కోట్లు వచ్చినట్లు తెలిపారు ఈవో శ్యామల రావు. ప్రస్తుతం స్వామి దర్శనం కోసం డైరెక్టు లైన్ కొనసాగుతోందని, టోకెన్లు లేని భక్తులకు 8 గంటలకు పైగా సమయం పడుతుందన్నారు.